Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ బృందం రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 06:59 PM

ప్రజావాణి అర్జీలకు త్వరిత పరిష్కారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి అర్జీలకు త్వరిత పరిష్కారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి అర్జీలకు త్వరిత పరిష్కారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
April 27, 2026 04:54 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి పాల్గొని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 57 అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

శాఖల వారీగా వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 39, జిల్లా పంచాయతీకి 5, చేనేత–జౌళి శాఖకు 4, మున్సిపాలిటీకి 2, శిశు సంక్షేమ శాఖకు 2, వ్యవసాయ శాఖకు 2 అర్జీలు రాగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హౌసింగ్, సర్వే–ల్యాండ్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News