ప్రజావాణి అర్జీలకు త్వరిత పరిష్కారం అదనపు కలెక్టర్ భాస్కర్రావు
ప్రజావాణి అర్జీలకు త్వరిత పరిష్కారం అదనపు కలెక్టర్ భాస్కర్రావు
Editor Desk
యాదాద్రి భువనగిరి
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్రావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి పాల్గొని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 57 అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
శాఖల వారీగా వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 39, జిల్లా పంచాయతీకి 5, చేనేత–జౌళి శాఖకు 4, మున్సిపాలిటీకి 2, శిశు సంక్షేమ శాఖకు 2, వ్యవసాయ శాఖకు 2 అర్జీలు రాగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హౌసింగ్, సర్వే–ల్యాండ్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి