Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:42 PM

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం
13-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 65 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 46, పీడీ హౌసింగ్‌కు 4, సర్వే ల్యాండ్‌కు 4, జిల్లా పంచాయతీకి 3, శిశు సంక్షేమానికి 2, జిల్లా గ్రామీణ అభివృద్ధికి 2 అర్జీలు వచ్చాయి. సివిల్ సప్లై, కో-ఆపరేటివ్, డీపీఆర్ఓ, మార్కెటింగ్ శాఖలకు ఒక్కటి చొప్పున అందినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం

Article Image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 65 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 46, పీడీ హౌసింగ్‌కు 4, సర్వే ల్యాండ్‌కు 4, జిల్లా పంచాయతీకి 3, శిశు సంక్షేమానికి 2, జిల్లా గ్రామీణ అభివృద్ధికి 2 అర్జీలు వచ్చాయి. సివిల్ సప్లై, కో-ఆపరేటివ్, డీపీఆర్ఓ, మార్కెటింగ్ శాఖలకు ఒక్కటి చొప్పున అందినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News