ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం
ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం
Editor Desk
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 65 అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 46, పీడీ హౌసింగ్కు 4, సర్వే ల్యాండ్కు 4, జిల్లా పంచాయతీకి 3, శిశు సంక్షేమానికి 2, జిల్లా గ్రామీణ అభివృద్ధికి 2 అర్జీలు వచ్చాయి. సివిల్ సప్లై, కో-ఆపరేటివ్, డీపీఆర్ఓ, మార్కెటింగ్ శాఖలకు ఒక్కటి చొప్పున అందినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి