ప్రజల తీర్పుతో అధికారం.. ఇంద్రపాలనగరానికి కొత్త నాయకత్వం
ప్రజల తీర్పుతో అధికారం.. ఇంద్రపాలనగరానికి కొత్త నాయకత్వం
స్థానికం బృందం
ఇంద్రపాలనగరంలో సంతోష వేడుకలు
స్థానికం ప్రధాన ప్రతినిధి
ఇంద్రపాలనగరం గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 1977–78 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వవిద్యార్థి గర్ధాస్ దామోదర్ కుమారుడు గర్ధాస్ విక్రమ్ గ్రామ సర్పంచ్గా ఘన విజయం సాధించడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పూర్వ ఉపాధ్యాయులు కలిసి గర్ధాస్ విక్రమ్ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మందడి విద్యాసాగర్ రెడ్డి, మల్లం ఆగయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు శివగల్ల నర్సింహా, చంద్రయ్య, ఆమినొద్దిన్, నల్ల గోపాల్, గర్ధాస్ దామోదర్ పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పాలన సాగించాలని సన్మానించిన వారు ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పెద్దల ఆశీస్సులు, ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి