Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:59 AM

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు
January 30, 2026 07:07 PM 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

దేవలమ్మ నాగారంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు

చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా దేవలమ్మ నాగారంలో విద్యుత్ శాఖ ఏఈ సతీష్ విస్తృ తంగా మరమ్మతులు చేపట్టారు. ప్రతి వారం మూడు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం దేవలమ్మ నాగారంలో సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ లో వోల్టేజ్ కారణంగా కొన్ని ఇండ్లలో ఫ్యాన్లు తిరగడం లేదని వారు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పై స్పందించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిదంగా రోడ్డు మధ్యలో వున్నా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఐరన్ స్తంభాల ప్లేస్ లో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాబాట కార్య క్రమం ద్వారా ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయడం వల్ల విద్యుత్ నష్టాలు తగ్గి సరఫరా సక్రమంగా ఉంటుందని తెలిపారు. వినియోగదారు లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్, లైన్మెన్ సూర్యనారాయణ , అసిస్టెంట్ లైన్మెన్ కిషోర్ కుమార్, ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనూప్ రెడ్డి వార్డ్ మెంబర్స్, ఊదరి రమేష్, బొమ్మ అమరావతి, పాక రాము ,దోనూరు కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మ మైసయ్య ,ఆది మహావిష్ణు దేవాలయం చైర్మన్ వరకాంతం జంగారెడ్డి , సీతా రామాలయం చైర్మన్ పన్నాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News