Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:44 PM

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్
January 30, 2026 12:09 PM 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం:

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ కీలక అడుగు వేశారు. గ్రామానికి చెందిన ధాత రవ్వ నర్సింహా సహకారంతో సుమారు రూ. 84,500 వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సర్పంచ్ విక్రమ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమం గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు నింపింది.

పిల్లల భద్రతతో పాటు పాఠశాల ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ విక్రమ్ తెలిపారు. విద్యకు, విద్యార్థుల భద్రతకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు సింగణబోయిన గణేష్ యాదవ్, సింగణబోయిన శ్రీశైలం, మందడి శ్రీధర్ రెడ్డి, రాజన్నగారి రమేష్, గర్ధాస్ వెంకటేష్, పద్మారావు, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, చిన్నపాక సురేష్, బోనగిరి సంజీవ, వెలకుర్తి జానాచారి, బాజ నరేందర్, మర్రి మహేష్, సింగణబోయిన మల్లేష్, కాటపల్లి మహేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, నక్క వెంకటేష్, రేపాక సత్తయ్య, పుట్టల సాయికుమార్, సింగణబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News