Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:02 AM

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్
January 30, 2026 12:09 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఇంద్రపాలనగరం:

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ కీలక అడుగు వేశారు. గ్రామానికి చెందిన ధాత రవ్వ నర్సింహా సహకారంతో సుమారు రూ. 84,500 వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సర్పంచ్ విక్రమ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమం గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు నింపింది.

పిల్లల భద్రతతో పాటు పాఠశాల ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ విక్రమ్ తెలిపారు. విద్యకు, విద్యార్థుల భద్రతకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు సింగణబోయిన గణేష్ యాదవ్, సింగణబోయిన శ్రీశైలం, మందడి శ్రీధర్ రెడ్డి, రాజన్నగారి రమేష్, గర్ధాస్ వెంకటేష్, పద్మారావు, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, చిన్నపాక సురేష్, బోనగిరి సంజీవ, వెలకుర్తి జానాచారి, బాజ నరేందర్, మర్రి మహేష్, సింగణబోయిన మల్లేష్, కాటపల్లి మహేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, నక్క వెంకటేష్, రేపాక సత్తయ్య, పుట్టల సాయికుమార్, సింగణబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News