Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:10 AM

ప్రభుత్వ కళాశాల విద్యార్థిని మెరుపులు: ఇంటర్‌లో నేహశ్రీ రాష్ట్రస్థాయి ర్యాంకు

ప్రభుత్వ కళాశాల విద్యార్థిని మెరుపులు: ఇంటర్‌లో నేహశ్రీ రాష్ట్రస్థాయి ర్యాంకు

ప్రభుత్వ కళాశాల విద్యార్థిని మెరుపులు: ఇంటర్‌లో నేహశ్రీ రాష్ట్రస్థాయి ర్యాంకు
13-04-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పేదరికం ఆమె ప్రతిభకు అడ్డుకాలేదు.. సర్కారు చదువు ఆమె లక్ష్యానికి తక్కువ కాలేదు.. పట్టుదలతో చదివి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ సామాన్య విద్యార్థిని. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది.​ ​రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నేహశ్రీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకును కైవసం చేసుకుంది. ​నిరుపేద కుటుంబానికి చెందిన నేహశ్రీ తన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేసింది. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా నేహశ్రీని గ్రామస్థులు, కళాశాల ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుతో తమ గ్రామానికి, జిల్లాకు పేరు తెచ్చిన నేహశ్రీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

Sthanikam

ప్రభుత్వ కళాశాల విద్యార్థిని మెరుపులు: ఇంటర్‌లో నేహశ్రీ రాష్ట్రస్థాయి ర్యాంకు

Article Image

పేదరికం ఆమె ప్రతిభకు అడ్డుకాలేదు.. సర్కారు చదువు ఆమె లక్ష్యానికి తక్కువ కాలేదు.. పట్టుదలతో చదివి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ సామాన్య విద్యార్థిని. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది.​ ​రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నేహశ్రీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకును కైవసం చేసుకుంది. ​నిరుపేద కుటుంబానికి చెందిన నేహశ్రీ తన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేసింది. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా నేహశ్రీని గ్రామస్థులు, కళాశాల ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుతో తమ గ్రామానికి, జిల్లాకు పేరు తెచ్చిన నేహశ్రీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News