ప్రభుత్వ కళాశాల విద్యార్థిని మెరుపులు: ఇంటర్లో నేహశ్రీ రాష్ట్రస్థాయి ర్యాంకు
ప్రభుత్వ కళాశాల విద్యార్థిని మెరుపులు: ఇంటర్లో నేహశ్రీ రాష్ట్రస్థాయి ర్యాంకు
K.RAVI
పేదరికం ఆమె ప్రతిభకు అడ్డుకాలేదు.. సర్కారు చదువు ఆమె లక్ష్యానికి తక్కువ కాలేదు.. పట్టుదలతో చదివి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ సామాన్య విద్యార్థిని. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నేహశ్రీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకును కైవసం చేసుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన నేహశ్రీ తన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేసింది. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా నేహశ్రీని గ్రామస్థులు, కళాశాల ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుతో తమ గ్రామానికి, జిల్లాకు పేరు తెచ్చిన నేహశ్రీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి