Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:04 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత
January 26, 2026 10:57 AM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం గణతంత్ర దినోత్సవ వేడుకలతో ఉత్సాహంగా మారింది. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించే సందేశాన్ని అందించారు.

సమానత్వం, సౌభ్రాతృత్వమే భారత ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొన్నారు. లింగం, జాతి, మతం వంటి తారతమ్యాలకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ లక్ష్యమని స్పష్టం చేశారు.

వేడుకల్లో జాతీయ కేడెట్ దళం విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. పూర్తి వందేమాతరం గీతాన్ని తెలుగు అధ్యాపకులు కృష్ణ కౌండిన్య ఆలపించగా, సభికులంతా దేశభక్తి గళంతో అనుసరించారు.చరిత్ర అధ్యాపకులు డాక్టర్ కిషన్ గణతంత్ర దినోత్సవ చారిత్రక ప్రాధాన్యతను వివరించగా, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు నరేష్ రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచన నేపథ్యాన్ని వివరించారు. పాలనాశాస్త్ర అధ్యాపకులు తాటిశెట్టి శ్రీనివాసులు గణతంత్ర దినోత్సవ మహత్తును కొనియాడారు.

తెలుగు అధ్యాపకులు ఆంజనేయులు పాడిన దేశభక్తి గీతం వేడుకలకు మరింత ఊపునిచ్చింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు ప్రదానం చేశారు.

వేడుకలను విజయవంతంగా నిర్వహించిన శారీరక విద్యా సంచాలకులు డాక్టర్ ఎం. రవీంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఆంగ్ల అధ్యాపకులు రాధిక వ్యవహరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News