Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:57 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత
26-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం గణతంత్ర దినోత్సవ వేడుకలతో ఉత్సాహంగా మారింది. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించే సందేశాన్ని అందించారు.

సమానత్వం, సౌభ్రాతృత్వమే భారత ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొన్నారు. లింగం, జాతి, మతం వంటి తారతమ్యాలకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ లక్ష్యమని స్పష్టం చేశారు.

వేడుకల్లో జాతీయ కేడెట్ దళం విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. పూర్తి వందేమాతరం గీతాన్ని తెలుగు అధ్యాపకులు కృష్ణ కౌండిన్య ఆలపించగా, సభికులంతా దేశభక్తి గళంతో అనుసరించారు.చరిత్ర అధ్యాపకులు డాక్టర్ కిషన్ గణతంత్ర దినోత్సవ చారిత్రక ప్రాధాన్యతను వివరించగా, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు నరేష్ రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచన నేపథ్యాన్ని వివరించారు. పాలనాశాస్త్ర అధ్యాపకులు తాటిశెట్టి శ్రీనివాసులు గణతంత్ర దినోత్సవ మహత్తును కొనియాడారు.

తెలుగు అధ్యాపకులు ఆంజనేయులు పాడిన దేశభక్తి గీతం వేడుకలకు మరింత ఊపునిచ్చింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు ప్రదానం చేశారు.

వేడుకలను విజయవంతంగా నిర్వహించిన శారీరక విద్యా సంచాలకులు డాక్టర్ ఎం. రవీంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఆంగ్ల అధ్యాపకులు రాధిక వ్యవహరించారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత

Article Image
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం గణతంత్ర దినోత్సవ వేడుకలతో ఉత్సాహంగా మారింది. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించే సందేశాన్ని అందించారు.

సమానత్వం, సౌభ్రాతృత్వమే భారత ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొన్నారు. లింగం, జాతి, మతం వంటి తారతమ్యాలకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ లక్ష్యమని స్పష్టం చేశారు.

వేడుకల్లో జాతీయ కేడెట్ దళం విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. పూర్తి వందేమాతరం గీతాన్ని తెలుగు అధ్యాపకులు కృష్ణ కౌండిన్య ఆలపించగా, సభికులంతా దేశభక్తి గళంతో అనుసరించారు.చరిత్ర అధ్యాపకులు డాక్టర్ కిషన్ గణతంత్ర దినోత్సవ చారిత్రక ప్రాధాన్యతను వివరించగా, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు నరేష్ రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచన నేపథ్యాన్ని వివరించారు. పాలనాశాస్త్ర అధ్యాపకులు తాటిశెట్టి శ్రీనివాసులు గణతంత్ర దినోత్సవ మహత్తును కొనియాడారు.

తెలుగు అధ్యాపకులు ఆంజనేయులు పాడిన దేశభక్తి గీతం వేడుకలకు మరింత ఊపునిచ్చింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు ప్రదానం చేశారు.

వేడుకలను విజయవంతంగా నిర్వహించిన శారీరక విద్యా సంచాలకులు డాక్టర్ ఎం. రవీంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఆంగ్ల అధ్యాపకులు రాధిక వ్యవహరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News