ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులకు సమయానికి హాజరవుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. రోజువారీగా ఇన్పేషెంట్, ఔట్పేషెంట్గా ఎంతమంది రోగులు వస్తున్నారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.గర్భిణీ స్త్రీలు చెకప్కు ఎంతమంది వస్తున్నారని విచారించిన కలెక్టర్, ఒక గర్భిణీ మహిళతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలపై సమాచారం సేకరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేయాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ప్రతి నెల ఎంతమంది ప్రసవాలు జరుగుతున్నాయన్న వివరాలను తెలుసుకున్న కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు, సిబ్బంది మరింత కృషి చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో ఎలాంటి మందుల కొరత లేకుండా నిరంతరం సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి