Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:59 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన
January 07, 2026 06:47 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాల్యవివాహాలు అనర్థాలకు దారితీస్తాయి – ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ విభాగం సహకారంతో ఎన్ఎస్ఎస్ యూనిట్–I, యూనిట్–IIల ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ బాల్యంలో జరిగే వివాహాలు అనేక అనర్థాలకు దారితీస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలను ప్రోత్సహించకుండా నిలువరించాలని, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత వివాహం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చని సూచించారు.వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో బాల్యవివాహాలపై అవగాహన పెంపొందించడంలో విద్యాసంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జెండర్ స్పెషలిస్టులు నిఖిత, భార్గవి బాల్యవివాహాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపరమైన దుష్పరిణామాలను వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ కిషన్, డాక్టర్ రాచమల్ల శ్రీను, అమర్, నరేష్, ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News