ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన
Editor Desk
బాల్యవివాహాలు అనర్థాలకు దారితీస్తాయి – ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ విభాగం సహకారంతో ఎన్ఎస్ఎస్ యూనిట్–I, యూనిట్–IIల ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ బాల్యంలో జరిగే వివాహాలు అనేక అనర్థాలకు దారితీస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలను ప్రోత్సహించకుండా నిలువరించాలని, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత వివాహం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చని సూచించారు.వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో బాల్యవివాహాలపై అవగాహన పెంపొందించడంలో విద్యాసంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జెండర్ స్పెషలిస్టులు నిఖిత, భార్గవి బాల్యవివాహాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపరమైన దుష్పరిణామాలను వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ కిషన్, డాక్టర్ రాచమల్ల శ్రీను, అమర్, నరేష్, ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి