పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో పలువురు అనారోగ్యం, ప్రమాద ఘటనలతో బాధపడుతున్న కుటుంబాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధితులకు ధైర్యం చెప్పారు.
కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన గుండు చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా, వారి మృతదేహానికిపూలమాలవేసినివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.అలాగే నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామం మొదటి వార్డు సభ్యురాలు కొల్లు సుగుణమ్మ ప్రమాదవశాత్తు గాయపడి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనారోగ్యంతో మృతి చెందిన చందుపట్ల గ్రామానికి చెందిన కామళ్ల సుధీర్ మృతదేహానికి కూడా ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇక నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన దొరపల్లి భిక్షమయ్య అనారోగ్యంతో మృతి చెందగా, వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఈ కష్టకాలంలో కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా ఇచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి