Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:40 AM

పదోన్నతి పొందిన అధ్యాపకులకు కళాశాలలో ఘన సన్మానం.

పదోన్నతి పొందిన అధ్యాపకులకు కళాశాలలో ఘన సన్మానం.

పదోన్నతి పొందిన అధ్యాపకులకు కళాశాలలో ఘన సన్మానం.
January 27, 2026 07:38 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు, వాణిజ్య, రసాయన, భౌతికశాస్త్ర విభాగాల అధ్యాపకులు డా. వెల్దండి శ్రీధర్, డా. జానపటి నాగరాజు, డా. అనిల్ అబ్రహం, డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి సహ ఆచార్యులుగా పదోన్నతి పొందిన సందర్భంగా కళాశాల స్టాఫ్ క్లబ్ ఘన సన్మానం నిర్వహించింది.కళాశాల సెమినార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మరియు ఇతర అధ్యాపకులు వారిని శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ అధ్యాపకులకు పదోన్నతి లభించడం కళాశాల కోసం గర్వకారణమని, వారి పరిశోధనలు, బోధనా పటిమ విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు.సన్మానం పొందిన అధ్యాపకులు తమ వృత్తిపరమైన ఎదుగుదలకు తోటి అధ్యాపకులు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసి, భవిష్యత్తులో విద్యార్థుల ఉన్నతికి, కళాశాల అభివృద్ధికి తమ శక్తినిచ్చి కృషి చేస్తామని తెలిపారు.

అదేవిధంగా, ఇటీవల డాక్టరేట్ పొందిన కళాశాల అతిథి అధ్యాపకులు డా. మహేశ్వరి, డా. సరిత, డా. స్రవంతి లను కూడా ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రాధికారి డా. డి. మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బి. నాగరాజు, స్టాఫ్ క్లబ్ కార్యదర్శి డా. ఎ. మల్లేశం, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. జి. భాగ్యలక్ష్మి, అధ్యాపకులు డా. అనిల్ బొజ్జ, డా. ప్రసన్న కుమార్, డా. జ్యోత్స్న, స్టాఫ్ క్లబ్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News