PRINT TIME: May 26, 2026 11:43 PM
పదో వార్డులో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పరిశీలన
పదో వార్డులో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పరిశీలన
January 11, 2026 03:06 PM
175 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
పదో వార్డులో ప్రజాసమస్యలపై సర్పంచ్ సాయికుమార్ గౌడ్ క్షేత్రస్థాయి పరిశీలన
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలోని పదో వార్డు కాలనీలో ఆదివారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు తదితర మౌలిక వసతులపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే ప్రణాళికలు రూపొందించారు.
ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా దశలవారీగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ పర్యటనతో కాలనీవాసుల్లో ఆశాభావం వ్యక్తమైంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి