Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:36 AM

పద్మశాలి సర్పంచులకు అఖిల భారత పద్మశాలి సంఘం ఘన సన్మానం

పద్మశాలి సర్పంచులకు అఖిల భారత పద్మశాలి సంఘం ఘన సన్మానం

 పద్మశాలి సర్పంచులకు అఖిల భారత పద్మశాలి సంఘం ఘన సన్మానం
January 12, 2026 11:18 AM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన పద్మశాలి సర్పంచులకు ఘన సన్మానం

హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సర్పంచులుగా విజయం సాధించిన పద్మశాలి కులానికి చెందిన ప్రజాప్రతినిధులను అఖిల భారత పద్మశాలి సంఘం (రాజమోహల్లా) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమం 11 జనవరి 2026న నిర్వహించగా, ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల సేవాభావాన్ని గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వెల్లంకి గ్రామం పద్మశాలి కుటుంబానికి చెందిన శ్రీమతి ఇడెం రాధ శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి ఆమెను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని సర్పంచ్‌గా ఎన్నికవడం గర్వకారణమని పేర్కొంటూ, గ్రామాభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో కందగట్ల స్వామి, జగన్నాధం, రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర చైర్మన్ వీరబత్తిని అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు ఎల్. రమణ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేష్, రవ్వ పాండు తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘం భవిష్యత్తులోనూ ప్రజాప్రతినిధులకు అండగా నిలుస్తుందని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News