Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:47 PM

పద్మశాలి సర్పంచులకు అఖిల భారత పద్మశాలి సంఘం ఘన సన్మానం

పద్మశాలి సర్పంచులకు అఖిల భారత పద్మశాలి సంఘం ఘన సన్మానం

 పద్మశాలి సర్పంచులకు అఖిల భారత పద్మశాలి సంఘం ఘన సన్మానం
January 12, 2026 11:18 AM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన పద్మశాలి సర్పంచులకు ఘన సన్మానం

హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సర్పంచులుగా విజయం సాధించిన పద్మశాలి కులానికి చెందిన ప్రజాప్రతినిధులను అఖిల భారత పద్మశాలి సంఘం (రాజమోహల్లా) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమం 11 జనవరి 2026న నిర్వహించగా, ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల సేవాభావాన్ని గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వెల్లంకి గ్రామం పద్మశాలి కుటుంబానికి చెందిన శ్రీమతి ఇడెం రాధ శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి ఆమెను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని సర్పంచ్‌గా ఎన్నికవడం గర్వకారణమని పేర్కొంటూ, గ్రామాభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో కందగట్ల స్వామి, జగన్నాధం, రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర చైర్మన్ వీరబత్తిని అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు ఎల్. రమణ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేష్, రవ్వ పాండు తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘం భవిష్యత్తులోనూ ప్రజాప్రతినిధులకు అండగా నిలుస్తుందని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News