పదవులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయుధాలుగా మారాలి: సిపిఎం
పదవులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయుధాలుగా మారాలి: సిపిఎం
Editor Desk
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సిపిఎం ప్రజా ప్రతినిధులకు మేక అశోక్ రెడ్డి
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
సిపిఎం ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని, పదవులను ప్రజా సమస్యలపై పోరాట ఆయుధాలుగా మార్చాలని సిపిఎం జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. రామన్నపేట మండలంలోని సిపిఎం మండల కార్యాలయంలో మండల వ్యాప్తంగా గెలుపొందిన సిపిఎం సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు అభినందన కార్యక్రమంతో పాటు గ్రామ పాలనపై అవగాహన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ప్రజా ప్రతినిధులు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరేలా చూడాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో ప్రజా ప్రతినిధులు వారధులుగా ఉండాలని తెలిపారు.
గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత సిపిఎం ప్రజా ప్రతినిధులపై ఉందని, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, దుబ్బాక గ్రామ సర్పంచ్ గట్టు నర్సింహా, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ల నరసింహ చారి, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, మండల కమిటీ సభ్యులు భావనలపల్లి బాలరాజు, గొరిగె సోములు, నాగటి ఉపేందర్, వేములసైదులు, ఆవనగంటి నాగేష్, మేడి గణేష్, నీల ఐలయ్య పాల్గొన్నారు.అలాగే శోభనాద్రిపురం ఉప సర్పంచ్లు పావిరాల మత్స్యగిరి, ముక్కామల మల్లేశం, వార్డు సభ్యులు వేముల లక్ష్మీదేవి, ఆవనగంటి వెంకటమ్మ, గట్టు ఉపేందర్, దండిగా నరసింహ, మోటే స్వామి, ఎండీ లతీఫ్, సంగీశెట్టి మహేష్, జెల్ల శ్రీనాథం, నాగటి ఉపేందర్, బోయిని మల్లేష్, గంటపాక శ్రీను, యాదాసు మంగమ్మ, బూడిద నర్మధ, భోగ సహదేవ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి