Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:48 PM

పదవులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయుధాలుగా మారాలి: సిపిఎం

పదవులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయుధాలుగా మారాలి: సిపిఎం

పదవులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయుధాలుగా మారాలి: సిపిఎం
January 08, 2026 06:41 PM 215 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సిపిఎం ప్రజా ప్రతినిధులకు మేక అశోక్ రెడ్డి

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సిపిఎం ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని, పదవులను ప్రజా సమస్యలపై పోరాట ఆయుధాలుగా మార్చాలని సిపిఎం జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. రామన్నపేట మండలంలోని సిపిఎం మండల కార్యాలయంలో మండల వ్యాప్తంగా గెలుపొందిన సిపిఎం సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభినందన కార్యక్రమంతో పాటు గ్రామ పాలనపై అవగాహన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ప్రజా ప్రతినిధులు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరేలా చూడాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో ప్రజా ప్రతినిధులు వారధులుగా ఉండాలని తెలిపారు.

గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత సిపిఎం ప్రజా ప్రతినిధులపై ఉందని, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, దుబ్బాక గ్రామ సర్పంచ్ గట్టు నర్సింహా, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ల నరసింహ చారి, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, మండల కమిటీ సభ్యులు భావనలపల్లి బాలరాజు, గొరిగె సోములు, నాగటి ఉపేందర్, వేములసైదులు, ఆవనగంటి నాగేష్, మేడి గణేష్, నీల ఐలయ్య పాల్గొన్నారు.అలాగే శోభనాద్రిపురం ఉప సర్పంచ్‌లు పావిరాల మత్స్యగిరి, ముక్కామల మల్లేశం, వార్డు సభ్యులు వేముల లక్ష్మీదేవి, ఆవనగంటి వెంకటమ్మ, గట్టు ఉపేందర్, దండిగా నరసింహ, మోటే స్వామి, ఎండీ లతీఫ్, సంగీశెట్టి మహేష్, జెల్ల శ్రీనాథం, నాగటి ఉపేందర్, బోయిని మల్లేష్, గంటపాక శ్రీను, యాదాసు మంగమ్మ, బూడిద నర్మధ, భోగ సహదేవ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News