Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు
08-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

సమయం అత్యంత విలువైనదని, విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.

గురువారం అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన అధ్యయన మెటీరియల్‌ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి వార్షిక పరీక్షలంటే చాలామంది విద్యార్థులు భయపడతారని, అలాంటి భయాలకు తావివ్వకుండా ఇచ్చిన మెటీరియల్‌ను సక్రమంగా చదివితే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఒక కీలక మలుపు అని, ఇక్కడ సాధించిన విజయం ఉన్నత చదువులకు బాట వేస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు జీవితంలో ఎలా స్థిరపడాలో కూడా నేర్పిస్తారని చెప్పారు. విద్యార్థులు ఫోన్లు, సోషల్ మీడియా, టీవీలకు దూరంగా ఉండి పుస్తకాలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. వార్షిక పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి చదవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు.జిల్లాలోని మారుమూల గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నేస్తం ఫౌండేషన్ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు

Article Image
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

సమయం అత్యంత విలువైనదని, విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.

గురువారం అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన అధ్యయన మెటీరియల్‌ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి వార్షిక పరీక్షలంటే చాలామంది విద్యార్థులు భయపడతారని, అలాంటి భయాలకు తావివ్వకుండా ఇచ్చిన మెటీరియల్‌ను సక్రమంగా చదివితే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఒక కీలక మలుపు అని, ఇక్కడ సాధించిన విజయం ఉన్నత చదువులకు బాట వేస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు జీవితంలో ఎలా స్థిరపడాలో కూడా నేర్పిస్తారని చెప్పారు. విద్యార్థులు ఫోన్లు, సోషల్ మీడియా, టీవీలకు దూరంగా ఉండి పుస్తకాలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. వార్షిక పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి చదవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు.జిల్లాలోని మారుమూల గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నేస్తం ఫౌండేషన్ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News