Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:12 AM

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు
January 08, 2026 04:20 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

సమయం అత్యంత విలువైనదని, విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.

గురువారం అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన అధ్యయన మెటీరియల్‌ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి వార్షిక పరీక్షలంటే చాలామంది విద్యార్థులు భయపడతారని, అలాంటి భయాలకు తావివ్వకుండా ఇచ్చిన మెటీరియల్‌ను సక్రమంగా చదివితే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఒక కీలక మలుపు అని, ఇక్కడ సాధించిన విజయం ఉన్నత చదువులకు బాట వేస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు జీవితంలో ఎలా స్థిరపడాలో కూడా నేర్పిస్తారని చెప్పారు. విద్యార్థులు ఫోన్లు, సోషల్ మీడియా, టీవీలకు దూరంగా ఉండి పుస్తకాలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. వార్షిక పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి చదవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు.జిల్లాలోని మారుమూల గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నేస్తం ఫౌండేషన్ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News