Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:32 AM

పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ

పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ

పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ
February 06, 2026 06:11 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆడపిల్ల వివాహానికి ఐదేళ్లపాటు రూ.10,116కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు యాదవ్ ప్రకటనచిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నెం సైదులు యాదవ్ సంచలన ప్రకటన చేశారు. పదో వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, ఆడపిల్లల వివాహానికి ఐదు సంవత్సరాల పాటు రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శిలువేరు శేఖర్ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను ఆయన కోరారు. ప్రజల ఆశీర్వాదంతో శేఖర్ విజయం సాధించిన వెంటనే ఈ పథక

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకుడు కొసనం అశోక్ మాట్లాడుతూ, పదో వార్డులో శేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేకు గిఫ్ట్ ఇవ్వడంతో పాటు, వార్డు అభివృద్ధికి మరింత బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

అలాగే టీడీపీ నాయకుడు ఆరూరు సత్తయ్య మాట్లాడుతూ, చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డులకు టీడీపీ మద్దతు ఉంటుందని, పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శేఖర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి దివాకర్ రెడ్డి, దాసరి వెంకన్న, దిసెట్ల ఉపేందర్, ముస్తఫా, అమరోజు మదన్, అమరోజు వెంకన్న, అమీద్, రహమెన్, పృద్విరాజ్, కొమ్ము శేఖర్తో పాటు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News