పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ
పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ
Komidala Mahender reddy
ఆడపిల్ల వివాహానికి ఐదేళ్లపాటు రూ.10,116కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు యాదవ్ ప్రకటనచిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నెం సైదులు యాదవ్ సంచలన ప్రకటన చేశారు. పదో వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, ఆడపిల్లల వివాహానికి ఐదు సంవత్సరాల పాటు రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శిలువేరు శేఖర్ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను ఆయన కోరారు. ప్రజల ఆశీర్వాదంతో శేఖర్ విజయం సాధించిన వెంటనే ఈ పథక
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకుడు కొసనం అశోక్ మాట్లాడుతూ, పదో వార్డులో శేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేకు గిఫ్ట్ ఇవ్వడంతో పాటు, వార్డు అభివృద్ధికి మరింత బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
అలాగే టీడీపీ నాయకుడు ఆరూరు సత్తయ్య మాట్లాడుతూ, చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డులకు టీడీపీ మద్దతు ఉంటుందని, పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శేఖర్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి దివాకర్ రెడ్డి, దాసరి వెంకన్న, దిసెట్ల ఉపేందర్, ముస్తఫా, అమరోజు మదన్, అమరోజు వెంకన్న, అమీద్, రహమెన్, పృద్విరాజ్, కొమ్ము శేఖర్తో పాటు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి