భారీ బైక్ ర్యాలీతో శక్తి ప్రదర్శన
పదమూడు వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా కౌసల్యను ప్రకటించిన సందర్భంగా శనివారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో వార్డ్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అభ్యర్థి భూక్యా కౌసల్య పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా భూక్యా కౌసల్య మాట్లాడుతూ పదమూడు వ వార్డ్లో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో వార్డ్ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, భూక్యా మహేష్, అయూబ్, బాలెంల సంజీవ, బాలెంల వీరయ్య, రాగం లింగయ్య, అంతటి ఉప్పలయ్య, చెరుకు గంగరాజు తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి