Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:19 AM

పదహారు రోజులకే మదర్ డైరీ చైర్మన్ రాజీనామా… రైతుల్లో కలవరం

పదహారు రోజులకే మదర్ డైరీ చైర్మన్ రాజీనామా… రైతుల్లో కలవరం

పదహారు రోజులకే మదర్ డైరీ చైర్మన్ రాజీనామా… రైతుల్లో కలవరం
23-01-2026 665 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

మదర్ డైరీ పాల ఉత్పత్తి సహకార సంఘంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మందడి ప్రభాకర్ రెడ్డి కేవలం పదహారు రోజులకే తన పదవికి రాజీనామా చేయడం పాల సంఘంలో తీవ్ర చర్చకు దారి తీసింది.సంఘ కార్యకలాపాలపై పూర్తి అవగాహన, సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రభాకర్ రెడ్డికి ఎన్నిక సమయంలో సభ్యుల్లో విస్తృత మద్దతు లభించింది. మదర్ డైరీకి కొత్త ఊపిరి వస్తుందనే రైతుల ఆశలు బలంగా వ్యక్తమయ్యాయి. ఎలాంటి విభేదాలు లేకుండా ఎన్నిక సాఫీగా ముగియడం అప్పట్లో విశేషంగా నిలిచింది.అయితే బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం రైతులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేసింది. పలు అనివార్య కారణాల నేపథ్యంలోనే తన ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆరోగ్యం సహకరించకపోవడంతో

తన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మందడి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో పాల సంఘం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

మదర్ డైరీ నిర్వహణ, రైతుల ప్రయోజనాలపై తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది.

Sthanikam

పదహారు రోజులకే మదర్ డైరీ చైర్మన్ రాజీనామా… రైతుల్లో కలవరం

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

మదర్ డైరీ పాల ఉత్పత్తి సహకార సంఘంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మందడి ప్రభాకర్ రెడ్డి కేవలం పదహారు రోజులకే తన పదవికి రాజీనామా చేయడం పాల సంఘంలో తీవ్ర చర్చకు దారి తీసింది.సంఘ కార్యకలాపాలపై పూర్తి అవగాహన, సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రభాకర్ రెడ్డికి ఎన్నిక సమయంలో సభ్యుల్లో విస్తృత మద్దతు లభించింది. మదర్ డైరీకి కొత్త ఊపిరి వస్తుందనే రైతుల ఆశలు బలంగా వ్యక్తమయ్యాయి. ఎలాంటి విభేదాలు లేకుండా ఎన్నిక సాఫీగా ముగియడం అప్పట్లో విశేషంగా నిలిచింది.అయితే బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం రైతులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేసింది. పలు అనివార్య కారణాల నేపథ్యంలోనే తన ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆరోగ్యం సహకరించకపోవడంతో

తన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మందడి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో పాల సంఘం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

మదర్ డైరీ నిర్వహణ, రైతుల ప్రయోజనాలపై తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News