పదహారు రోజులకే మదర్ డైరీ చైర్మన్ రాజీనామా… రైతుల్లో కలవరం
పదహారు రోజులకే మదర్ డైరీ చైర్మన్ రాజీనామా… రైతుల్లో కలవరం
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
మదర్ డైరీ పాల ఉత్పత్తి సహకార సంఘంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మందడి ప్రభాకర్ రెడ్డి కేవలం పదహారు రోజులకే తన పదవికి రాజీనామా చేయడం పాల సంఘంలో తీవ్ర చర్చకు దారి తీసింది.సంఘ కార్యకలాపాలపై పూర్తి అవగాహన, సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రభాకర్ రెడ్డికి ఎన్నిక సమయంలో సభ్యుల్లో విస్తృత మద్దతు లభించింది. మదర్ డైరీకి కొత్త ఊపిరి వస్తుందనే రైతుల ఆశలు బలంగా వ్యక్తమయ్యాయి. ఎలాంటి విభేదాలు లేకుండా ఎన్నిక సాఫీగా ముగియడం అప్పట్లో విశేషంగా నిలిచింది.అయితే బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం రైతులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేసింది. పలు అనివార్య కారణాల నేపథ్యంలోనే తన ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆరోగ్యం సహకరించకపోవడంతో
తన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మందడి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో పాల సంఘం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
మదర్ డైరీ నిర్వహణ, రైతుల ప్రయోజనాలపై తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి