PRINT TIME: April 10, 2026 10:37 AM
ఓటుకు వెండి విగ్రహం… గెలిచాక బయటపడిన షాకింగ్ నిజం!
ఓటుకు వెండి విగ్రహం… గెలిచాక బయటపడిన షాకింగ్ నిజం!
January 10, 2026 09:55 PM
165 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిలీ వెండితో గెలిచిన విజయం నిలుస్తుందా? లేక చట్టమే తుది తీర్పు చెబుతుందా?
స్థానికం ప్రధాన ప్రతినిధి
కొండమల్లేపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు సభ్యుడు చేసిన వ్యవహారం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది.ఎన్నికల సమయంలో తనకే ఓటు వేయాలంటూ ఓటర్లకు ఓటుకు 2 తులాల వెండి విగ్రహం అందజేసి, ప్రమాణం చేయించుకున్నాడు.
విగ్రహాల పంపిణీతో ప్రభావితమైన ఓటర్లు అదే వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించారు.
కానీ అసలు ట్విస్ట్ ఎన్నికల తర్వాతే బయటపడింది…ఇటీవల ఆ వెండి విగ్రహాలను పరీక్షించగా, అవి నకిలీవి అని తేలింది.
దీంతో మోసపోయామని గ్రహించిన ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమను మభ్యపెట్టి ఓట్లు పొందిన ప్రజాప్రతినిధిపై,అలాగే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి