Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:20 AM

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన
April 13, 2026 04:40 PM 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,:

భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో ఈరోజు ఆదోని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర లోపాలు ఉన్నాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్, సహాయ కార్యదర్శి కె. రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఒకే ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా, 6 వేర్వేరు వార్డుల పోలింగ్ బూత్‌లలో నమోదు కావడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు విభిన్న బూత్‌లకు వెళ్లాల్సి రావడం వల్ల ఇబ్బందులు అధికమవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.

ఎన్నికల నియమావళి ప్రకారం ఓటరు తన నివాస వార్డు పరిధిలోని పోలింగ్ బూత్‌లోనే నమోదు కావాలని స్పష్టం చేస్తూ, వెంటనే లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజిత్ గౌడ్, కే. లింగప్ప, డీహెచ్‌పీఎస్ అధ్యక్షులు కొత్తూరు ఈరన్న, కార్యదర్శి ఏ. విజయ్ కుమార్, లక్ష్మన్న, నూకన్నా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News