Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:43 PM

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన
13-04-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,:

భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో ఈరోజు ఆదోని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర లోపాలు ఉన్నాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్, సహాయ కార్యదర్శి కె. రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఒకే ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా, 6 వేర్వేరు వార్డుల పోలింగ్ బూత్‌లలో నమోదు కావడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు విభిన్న బూత్‌లకు వెళ్లాల్సి రావడం వల్ల ఇబ్బందులు అధికమవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.

ఎన్నికల నియమావళి ప్రకారం ఓటరు తన నివాస వార్డు పరిధిలోని పోలింగ్ బూత్‌లోనే నమోదు కావాలని స్పష్టం చేస్తూ, వెంటనే లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజిత్ గౌడ్, కే. లింగప్ప, డీహెచ్‌పీఎస్ అధ్యక్షులు కొత్తూరు ఈరన్న, కార్యదర్శి ఏ. విజయ్ కుమార్, లక్ష్మన్న, నూకన్నా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన

Article Image

ఆదోని,:

భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో ఈరోజు ఆదోని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర లోపాలు ఉన్నాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్, సహాయ కార్యదర్శి కె. రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఒకే ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా, 6 వేర్వేరు వార్డుల పోలింగ్ బూత్‌లలో నమోదు కావడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు విభిన్న బూత్‌లకు వెళ్లాల్సి రావడం వల్ల ఇబ్బందులు అధికమవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.

ఎన్నికల నియమావళి ప్రకారం ఓటరు తన నివాస వార్డు పరిధిలోని పోలింగ్ బూత్‌లోనే నమోదు కావాలని స్పష్టం చేస్తూ, వెంటనే లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజిత్ గౌడ్, కే. లింగప్ప, డీహెచ్‌పీఎస్ అధ్యక్షులు కొత్తూరు ఈరన్న, కార్యదర్శి ఏ. విజయ్ కుమార్, లక్ష్మన్న, నూకన్నా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News