ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన
ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన
Editor Desk
ఆదోని,:
భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో ఈరోజు ఆదోని మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర లోపాలు ఉన్నాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్, సహాయ కార్యదర్శి కె. రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఒకే ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా, 6 వేర్వేరు వార్డుల పోలింగ్ బూత్లలో నమోదు కావడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు విభిన్న బూత్లకు వెళ్లాల్సి రావడం వల్ల ఇబ్బందులు అధికమవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.
ఎన్నికల నియమావళి ప్రకారం ఓటరు తన నివాస వార్డు పరిధిలోని పోలింగ్ బూత్లోనే నమోదు కావాలని స్పష్టం చేస్తూ, వెంటనే లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజిత్ గౌడ్, కే. లింగప్ప, డీహెచ్పీఎస్ అధ్యక్షులు కొత్తూరు ఈరన్న, కార్యదర్శి ఏ. విజయ్ కుమార్, లక్ష్మన్న, నూకన్నా తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి