Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:18 PM

ఓటు హక్కు వినియోగమే ప్రజాస్వామ్యానికి బలం

ఓటు హక్కు వినియోగమే ప్రజాస్వామ్యానికి బలం

ఓటు హక్కు వినియోగమే ప్రజాస్వామ్యానికి బలం
January 23, 2026 03:21 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహణ

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాహత్ ఖానం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటునువినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా సమానంగా ఉంటాయని, ఓటు హక్కు ప్రతి ఓటరికి కలిగిన ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తదనంతరం కళాశాల సిబ్బంది, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ జే. చినబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, డాక్టర్ నీలిమ, డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, అమర్, ఆంజనేయులు, నరేష్, రవి, రాధికలతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News