Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:38 AM

ఓటు హక్కు వినియోగమే ప్రజాస్వామ్యానికి బలం

ఓటు హక్కు వినియోగమే ప్రజాస్వామ్యానికి బలం

ఓటు హక్కు వినియోగమే ప్రజాస్వామ్యానికి బలం
January 23, 2026 03:21 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహణ

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాహత్ ఖానం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటునువినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా సమానంగా ఉంటాయని, ఓటు హక్కు ప్రతి ఓటరికి కలిగిన ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తదనంతరం కళాశాల సిబ్బంది, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ జే. చినబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, డాక్టర్ నీలిమ, డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, అమర్, ఆంజనేయులు, నరేష్, రవి, రాధికలతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News