Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:45 AM

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను
January 22, 2026 05:43 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సొంత ఖర్చుతో వీధిలైటు ఏర్పాటు… ప్రజల హర్షం

స్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలంలోని వెలిమేడు గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి పోటీ చేసిన బొడ్డుపల్లి కల్పన–శ్రీను స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోకుండా, ఓడినప్పటికీ మాట నిలబెట్టుకుని ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

7వ వార్డులోని ఒక వీధిలో వీధిలైటు లేకపోవడంతో కాలనీ పూర్తిగా అంధకారంలో ఉండేది. ఈ సమస్యను గమనించిన కల్పన–శ్రీను ఎన్నికల ప్రచారంలో భాగంగా, గెలిచినా ఓడినా ఆ వీధిలో లైటు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే, ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తన సొంత ఖర్చుతో వీధిలైటును ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా కల్పన–శ్రీను మాట్లాడుతూ, ఇంతటితో అభివృద్ధి పనులు ఆగిపోవని స్పష్టం చేశారు.

గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధికి పదవులు ఒక్కటే ముఖ్యమికాదని, ప్రజాసేవే తన లక్ష్యమని అన్నారు. గ్రామ ప్రజలు, వార్డు ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు, వార్డు వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ కార్యక్రమంలో కునూరు గణేష్, గోలి సాయిరాం, కాలనీవాసులు బుట్టి పురుషోత్తం, లింగస్వామి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News