Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:20 PM

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను
January 22, 2026 05:43 PM 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సొంత ఖర్చుతో వీధిలైటు ఏర్పాటు… ప్రజల హర్షం

స్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలంలోని వెలిమేడు గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి పోటీ చేసిన బొడ్డుపల్లి కల్పన–శ్రీను స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోకుండా, ఓడినప్పటికీ మాట నిలబెట్టుకుని ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

7వ వార్డులోని ఒక వీధిలో వీధిలైటు లేకపోవడంతో కాలనీ పూర్తిగా అంధకారంలో ఉండేది. ఈ సమస్యను గమనించిన కల్పన–శ్రీను ఎన్నికల ప్రచారంలో భాగంగా, గెలిచినా ఓడినా ఆ వీధిలో లైటు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే, ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తన సొంత ఖర్చుతో వీధిలైటును ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా కల్పన–శ్రీను మాట్లాడుతూ, ఇంతటితో అభివృద్ధి పనులు ఆగిపోవని స్పష్టం చేశారు.

గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధికి పదవులు ఒక్కటే ముఖ్యమికాదని, ప్రజాసేవే తన లక్ష్యమని అన్నారు. గ్రామ ప్రజలు, వార్డు ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు, వార్డు వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ కార్యక్రమంలో కునూరు గణేష్, గోలి సాయిరాం, కాలనీవాసులు బుట్టి పురుషోత్తం, లింగస్వామి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News