Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:57 AM

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను
22-01-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సొంత ఖర్చుతో వీధిలైటు ఏర్పాటు… ప్రజల హర్షం

స్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలంలోని వెలిమేడు గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి పోటీ చేసిన బొడ్డుపల్లి కల్పన–శ్రీను స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోకుండా, ఓడినప్పటికీ మాట నిలబెట్టుకుని ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

7వ వార్డులోని ఒక వీధిలో వీధిలైటు లేకపోవడంతో కాలనీ పూర్తిగా అంధకారంలో ఉండేది. ఈ సమస్యను గమనించిన కల్పన–శ్రీను ఎన్నికల ప్రచారంలో భాగంగా, గెలిచినా ఓడినా ఆ వీధిలో లైటు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే, ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తన సొంత ఖర్చుతో వీధిలైటును ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా కల్పన–శ్రీను మాట్లాడుతూ, ఇంతటితో అభివృద్ధి పనులు ఆగిపోవని స్పష్టం చేశారు.

గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధికి పదవులు ఒక్కటే ముఖ్యమికాదని, ప్రజాసేవే తన లక్ష్యమని అన్నారు. గ్రామ ప్రజలు, వార్డు ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు, వార్డు వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ కార్యక్రమంలో కునూరు గణేష్, గోలి సాయిరాం, కాలనీవాసులు బుట్టి పురుషోత్తం, లింగస్వామి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను

Article Image

సొంత ఖర్చుతో వీధిలైటు ఏర్పాటు… ప్రజల హర్షం

స్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలంలోని వెలిమేడు గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి పోటీ చేసిన బొడ్డుపల్లి కల్పన–శ్రీను స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోకుండా, ఓడినప్పటికీ మాట నిలబెట్టుకుని ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

7వ వార్డులోని ఒక వీధిలో వీధిలైటు లేకపోవడంతో కాలనీ పూర్తిగా అంధకారంలో ఉండేది. ఈ సమస్యను గమనించిన కల్పన–శ్రీను ఎన్నికల ప్రచారంలో భాగంగా, గెలిచినా ఓడినా ఆ వీధిలో లైటు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే, ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తన సొంత ఖర్చుతో వీధిలైటును ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా కల్పన–శ్రీను మాట్లాడుతూ, ఇంతటితో అభివృద్ధి పనులు ఆగిపోవని స్పష్టం చేశారు.

గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధికి పదవులు ఒక్కటే ముఖ్యమికాదని, ప్రజాసేవే తన లక్ష్యమని అన్నారు. గ్రామ ప్రజలు, వార్డు ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు, వార్డు వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ కార్యక్రమంలో కునూరు గణేష్, గోలి సాయిరాం, కాలనీవాసులు బుట్టి పురుషోత్తం, లింగస్వామి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News