ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను
ఓటమి తర్వాత కూడా హామీ నెరవేర్చిన కల్పన–శ్రీను
స్థానికం బృందం
సొంత ఖర్చుతో వీధిలైటు ఏర్పాటు… ప్రజల హర్షం
స్థానికం ప్రధాన ప్రతినిధి
చిట్యాల మండలంలోని వెలిమేడు గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి పోటీ చేసిన బొడ్డుపల్లి కల్పన–శ్రీను స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోకుండా, ఓడినప్పటికీ మాట నిలబెట్టుకుని ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.
7వ వార్డులోని ఒక వీధిలో వీధిలైటు లేకపోవడంతో కాలనీ పూర్తిగా అంధకారంలో ఉండేది. ఈ సమస్యను గమనించిన కల్పన–శ్రీను ఎన్నికల ప్రచారంలో భాగంగా, గెలిచినా ఓడినా ఆ వీధిలో లైటు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే, ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తన సొంత ఖర్చుతో వీధిలైటును ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా కల్పన–శ్రీను మాట్లాడుతూ, ఇంతటితో అభివృద్ధి పనులు ఆగిపోవని స్పష్టం చేశారు.
గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధికి పదవులు ఒక్కటే ముఖ్యమికాదని, ప్రజాసేవే తన లక్ష్యమని అన్నారు. గ్రామ ప్రజలు, వార్డు ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు, వార్డు వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ కార్యక్రమంలో కునూరు గణేష్, గోలి సాయిరాం, కాలనీవాసులు బుట్టి పురుషోత్తం, లింగస్వామి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి