PRINT TIME: April 10, 2026 10:38 AM
ఒకటో వార్డు మెంబర్కు ఘన సన్మానం
ఒకటో వార్డు మెంబర్కు ఘన సన్మానం
January 16, 2026 08:05 AM
61 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మండలంలోని నిదానపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకటో వార్డు మెంబర్ చల్ల శిల్ప మల్లేశంకు ఘన సన్మానం జరిగింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం కొత్తగూడెం కింగ్స్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఏకగ్రీవ ఎన్నిక ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చల్ల శిల్ప మల్లేశం తెలిపారు.ఈ కార్యక్రమంలో యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి