ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా
ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా
Editor Desk
న్యూఢిల్లీ,
జాతీయ జనగణనలో ఓబీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ గజ్జెల సత్యరాజ్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గజ్జెల సత్యరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి చేపట్టనున్న జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జనగణనలో ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అనే విభాగాలు ఉన్నప్పటికీ ఓబీసీలకు ప్రత్యేక ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు.
ఓబీసీల జనాభా వివరాలు స్పష్టంగా తెలియాలంటే కులగణన తప్పనిసరిగా చేపట్టాలని, వెంటనే జనగణన ఫార్మాట్లో ఓబీసీ కాలమ్ చేర్చాలని కేంద్రాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ ప్రతినిధులు, బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి