Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:38 PM

ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా

ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా

ఓబీసీ కులగణనకు ఢిల్లీలో మహా ధర్నా
March 23, 2026 07:40 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూఢిల్లీ,

జాతీయ జనగణనలో ఓబీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ గజ్జెల సత్యరాజ్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గజ్జెల సత్యరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి చేపట్టనున్న జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జనగణనలో ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అనే విభాగాలు ఉన్నప్పటికీ ఓబీసీలకు ప్రత్యేక ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు.

ఓబీసీల జనాభా వివరాలు స్పష్టంగా తెలియాలంటే కులగణన తప్పనిసరిగా చేపట్టాలని, వెంటనే జనగణన ఫార్మాట్‌లో ఓబీసీ కాలమ్ చేర్చాలని కేంద్రాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ ప్రతినిధులు, బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News