నూతన వస్త్ర అలంకరణ మహోత్సవంలో పాల్గొన్న టీఆర్పీ నాయకులు
నూతన వస్త్ర అలంకరణ మహోత్సవంలో పాల్గొన్న టీఆర్పీ నాయకులు
Biksham
చిన్నారిని ఆశీర్వదించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం
సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణ దాసు కవితా వేణు పుత్రిక నూతన వస్త్ర అలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నెం మంజుల చిన్నారిని ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నారి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ప్రజా ప్రతినిధి నేలచెర్ల మధు, లింగాల సైదులు, వట్టే లింగరాజు, వెంకటేష్ గౌడ్, కుమార్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి