నూతన సర్పంచులకు ప్రశంసా పత్రాల అందజేత
నూతన సర్పంచులకు ప్రశంసా పత్రాల అందజేత
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
చిట్యాల మండలానికి చెందిన నూతన సర్పంచులకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నల్లగొండలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి నిధులు, వృత్తి నైపుణ్యాలపై మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ శిక్షణలో పాల్గొని పూర్తి చేసిన సర్పంచులకు శుక్రవారం నల్లగొండలోని డీఆర్డిఏ కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి శంఖా నాయక్ ప్రశంసా పత్రాలు అందజేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య, బొంతల చంద్రారెడ్డి, ఆవుల సుందర్, బత్తుల లక్ష్మి ప్రసన్న, నరసింహ, పాలెం మహేష్, కోన్ రెడ్డి మహిపాల్ రెడ్డి, మిరియాల వెంకటేశం, కట్ట అంశయ్య, రూపాని సోనియా లింగస్వామి, అద్దె అండాలు యాదయ్య, గుణగంటి అలివేలు వెంకన్న, సాగర్ల భాను శ్రీ భిక్షం, నాగంపల్లి శ్యాంసుందర్, రేగులగడ్డ స్వామి, సాగర్ల యాదమ్మ యాదయ్య, అందాలు యాదయ్య తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి