Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:27 AM

నో హెల్మెట్ -నో పెట్రోల్ పై నార్కట్ పల్లి పోలీసుల విస్తృత అవగాహన

నో హెల్మెట్ -నో పెట్రోల్ పై నార్కట్ పల్లి పోలీసుల విస్తృత అవగాహన

నో హెల్మెట్ -నో పెట్రోల్ పై నార్కట్ పల్లి పోలీసుల విస్తృత అవగాహన
January 22, 2026 12:57 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు “నో హెల్మెట్ – నో పెట్రోల్” అవగాహన కార్యక్రమాన్ని నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నార్కెట్‌పల్లి పరిధిలోని వివిధ పెట్రోల్ బంకులను పోలీసులు సందర్శించి, హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయవద్దని బంకు యజమానులు, సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు. హెల్మెట్ తీసుకువచ్చిన తరువాత మాత్రమే పెట్రోల్ అందించాలని తెలిపారు.

అదేవిధంగా, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చట్టాన్ని గౌరవిస్తూ హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన పెరుగుతుందని, ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News