Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

నో హెల్మెట్ -నో పెట్రోల్ పై నార్కట్ పల్లి పోలీసుల విస్తృత అవగాహన

నో హెల్మెట్ -నో పెట్రోల్ పై నార్కట్ పల్లి పోలీసుల విస్తృత అవగాహన

నో హెల్మెట్ -నో పెట్రోల్ పై నార్కట్ పల్లి పోలీసుల విస్తృత అవగాహన
January 22, 2026 12:57 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు “నో హెల్మెట్ – నో పెట్రోల్” అవగాహన కార్యక్రమాన్ని నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నార్కెట్‌పల్లి పరిధిలోని వివిధ పెట్రోల్ బంకులను పోలీసులు సందర్శించి, హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయవద్దని బంకు యజమానులు, సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు. హెల్మెట్ తీసుకువచ్చిన తరువాత మాత్రమే పెట్రోల్ అందించాలని తెలిపారు.

అదేవిధంగా, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చట్టాన్ని గౌరవిస్తూ హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన పెరుగుతుందని, ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News