PRINT TIME: March 24, 2026 02:06 PM
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం
March 24, 2026 07:52 AM
33 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
న్యూఢిల్లీ:
లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని డిలిమిటేషన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల సంఖ్యను సుమారు 50 శాతం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని కూడా బిల్లులో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.
పునర్విభజన అమలైతే లోక్సభ స్థానాలు 816కు పెరిగే అవకాశం ఉందని అంచనా. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు 262–263కు, లోక్సభ స్థానాలు 37–38కు చేరే అవకాశం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 178–179కు, లోక్సభ స్థానాలు 25–26కు పెరిగే అవకాశముందని సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి