Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 08:41 AM

నిస్వార్థ సేవకు ప్రతీక… మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజాభిమానం పొందిన గుర్రం యాదగిరి రెడ్డి

నిస్వార్థ సేవకు ప్రతీక… మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజాభిమానం పొందిన గుర్రం యాదగిరి రెడ్డి

నిస్వార్థ సేవకు ప్రతీక… మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజాభిమానం పొందిన గుర్రం యాదగిరి రెడ్డి
April 13, 2026 02:44 PM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ మాట్లాడుతూ, నిస్వార్థానికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి సేవలను స్మరించుకున్నారు.

1985 నుండి 1999 వరకు రామన్నపేట నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుర్రం యాదగిరి రెడ్డి గారు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్ని పార్టీల కార్యకర్తలకు, తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సమానంగా సేవలందించిన నాయకుడని తెలిపారు. రైతు సంఘానికి ఆయన అందించిన సేవలు అమూల్యమైనవని, ప్రజల మధ్య అందుబాటులో ఉంటూ నిజాయితీతో సేవ చేయడం వల్లనే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేరువగా ఉంటూ సేవ చేయడం కమ్యూనిస్టు నాయకుల చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. గుర్రం యాదగిరి రెడ్డి గారి జీవితం నేటి యువతకు, రాజకీయ నాయకులకు ఆదర్శమని చెప్పారు.

అలాగే, గతంలో కొన్ని రాజకీయ కారణాల వల్ల రామన్నపేట నియోజకవర్గాన్ని విభజించారని గుర్తుచేస్తూ, ప్రస్తుతం పునర్విభజనలో భాగంగా రామన్నపేటను తిరిగి నియోజకవర్గంగా సాధించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పోరాడి నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితిలో సిపిఐ ముఖ్య పాత్ర పోషిస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, డీఎస్పీ, బీఎస్పీ, టీజేఎస్ వంటి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ ఉద్యమంలో భాగస్వాములై పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు.

మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు సాగి ముందుగా నియోజకవర్గాన్ని సాధించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని, అదే మన అభివృద్ధికి దారి తీస్తుందని, నియోజకవర్గ సాధనే మన అంతిమ లక్ష్యమని ఊట్కూరు నరసింహ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News