PRINT TIME: May 26, 2026 11:49 PM
నిదానపల్లిలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర
నిదానపల్లిలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర
January 12, 2026 05:14 PM
91 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం:
రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న మల్లన్న సన్నిధి నిత్యం భక్తులతో కళకళలాడుతూ కనిపించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు ఆలయానికి వస్తున్న ఆదరణ ఆలయ ప్రాముఖ్యతను చాటుతోందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి