PRINT TIME: February 24, 2026 03:20 AM
నిదానపల్లిలో గణతంత్ర వేడుకలు… ప్రజాస్వామ్యానికి యువత సెల్యూట్
నిదానపల్లిలో గణతంత్ర వేడుకలు… ప్రజాస్వామ్యానికి యువత సెల్యూట్
January 26, 2026 12:13 PM
201 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామం గణతంత్ర దినోత్సవ వేడుకలతో దేశభక్తి ఉత్సాహంతో ఉప్పొంగింది. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు నారపాక నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
గణతంత్ర దినోత్సవాన్ని ప్రజాస్వామ్య విలువలతో అనుసంధానిస్తూ, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లయ్య తో పాటు పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా అంబేద్కర్ యువజన సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, ప్రజాస్వామ్య చైతన్యాన్ని మరింత బలోపేతం చేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి