Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:21 PM

నేతాజీ జయంతి సందర్భంగా రామన్నపేటలో ఘన నివాళులు

నేతాజీ జయంతి సందర్భంగా రామన్నపేటలో ఘన నివాళులు

నేతాజీ జయంతి సందర్భంగా రామన్నపేటలో ఘన నివాళులు
January 23, 2026 02:31 PM 303 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

భారత స్వాతంత్ర్య పోరాటంలో అజేయ ధైర్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని రామన్నపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో గల నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దిన్ మాట్లాడుతూ… బ్రిటిష్ పాలనను అహింసతో కాకుండా సాయుధ పోరాటంతో ఎదుర్కోవాలన్న ఆలోచనతో ముందుకు సాగిన విప్లవ నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన నేతాజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గం నేటికీ ఆదర్శనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరికే సత్యనారాయణతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, సాల్వేరు అశోక్, బొడ్డు సాలయ్యా, బొడ్డు శంకరయ్య, కోట సుధాకర్, ఆముద లక్ష్మణ్, మన్సూర్ అలీ, నాసర్, గొలుసుల ప్రసాద్, పల్లపు రవి, కేశవదాసు ఉదయ్, మేడి శంకరయ్య, ఇనయతుల్ల బేగ్, మహమ్మద్ రిజ్వాన్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు మోటె మహేష్, కొమ్ము రామస్వామి, గొరిగె శేఖర్ తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News