Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:59 AM

నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు. రవీంద్రభారతిలో ఘన సన్మానం.

నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు. రవీంద్రభారతిలో ఘన సన్మానం.

నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు. రవీంద్రభారతిలో ఘన సన్మానం.
19-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజ్ఞిక ఫౌండేషన్ దశమ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ హర్యానా గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, త్రిపుర ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ వెంకటేశ్వర్లు, సినీ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందజేసి సన్మానించారు.

గత పదేళ్లుగా సమాజ శ్రేయస్సు కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, నిరుద్యోగులకు మార్గదర్శకత్వం అందిస్తున్న నీలం శేఖర్ సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సామాజిక సంస్థలకు సమన్వయకర్తగా, గౌరవ సలహాదారుగా సేవలందిస్తున్న ఆయన పలు వేదికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దూల్‌పేట్ సీఐ సైదులు గౌడ్‌, ది మిషన్ సెవెన్ హిల్స్ వ్యవస్థాపకుడు సీఐ ఏడుకొండలు, ఉషోదయపు పల్లె ప్రకృతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీరశేఖర్‌లకు కూడా అవార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నీలం శేఖర్‌ను అభినందించారు.

Sthanikam

నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు. రవీంద్రభారతిలో ఘన సన్మానం.

Article Image

హైదరాబాద్‌: సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజ్ఞిక ఫౌండేషన్ దశమ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ హర్యానా గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, త్రిపుర ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ వెంకటేశ్వర్లు, సినీ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందజేసి సన్మానించారు.

గత పదేళ్లుగా సమాజ శ్రేయస్సు కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, నిరుద్యోగులకు మార్గదర్శకత్వం అందిస్తున్న నీలం శేఖర్ సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సామాజిక సంస్థలకు సమన్వయకర్తగా, గౌరవ సలహాదారుగా సేవలందిస్తున్న ఆయన పలు వేదికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దూల్‌పేట్ సీఐ సైదులు గౌడ్‌, ది మిషన్ సెవెన్ హిల్స్ వ్యవస్థాపకుడు సీఐ ఏడుకొండలు, ఉషోదయపు పల్లె ప్రకృతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీరశేఖర్‌లకు కూడా అవార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నీలం శేఖర్‌ను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News