నీలం శేఖర్కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు. రవీంద్రభారతిలో ఘన సన్మానం.
నీలం శేఖర్కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు. రవీంద్రభారతిలో ఘన సన్మానం.
Editor Desk
హైదరాబాద్: సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న నీలం శేఖర్కు రాష్ట్ర స్థాయి ఎక్సలెన్సీ అవార్డు లభించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజ్ఞిక ఫౌండేషన్ దశమ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ హర్యానా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, త్రిపుర ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ వెంకటేశ్వర్లు, సినీ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందజేసి సన్మానించారు.
గత పదేళ్లుగా సమాజ శ్రేయస్సు కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, నిరుద్యోగులకు మార్గదర్శకత్వం అందిస్తున్న నీలం శేఖర్ సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
సామాజిక సంస్థలకు సమన్వయకర్తగా, గౌరవ సలహాదారుగా సేవలందిస్తున్న ఆయన పలు వేదికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దూల్పేట్ సీఐ సైదులు గౌడ్, ది మిషన్ సెవెన్ హిల్స్ వ్యవస్థాపకుడు సీఐ ఏడుకొండలు, ఉషోదయపు పల్లె ప్రకృతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీరశేఖర్లకు కూడా అవార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నీలం శేఖర్ను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి