Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:01 PM

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం
23-01-2026 243 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో గౌరీ సహిత చంద్రశేఖర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది.

కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ప్రేమలత దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. గ్రామ ప్రధమ పౌరులుగా భక్తితో వారు చేసిన ఈ సేవ భక్తుల మనసులను ఆకట్టుకుంది.

ఉదయం గణపతి పూజ, ధ్వజారోహణం, కలశ స్థాపనలు, సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వీధివాడలుగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడంతో గ్రామమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు గంగుల వెంకట్ రెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీ రామ్ సునీత, శివకుమార్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు బోయిని ఐలమ్మ, ముత్యాల కిషన్, శానగొండ మల్లికార్జునాచారి, శానగొండ రవళి, కట్ట కుమార్ పాల్గొన్నారు.

అలాగే గ్రామ పెద్దలు వల్లే లింగారెడ్డి, వల్లే వెంకట్ రెడ్డి, బత్తుల మాధవరెడ్డి, వల్లే శేఖర్ రెడ్డి, మస్క్ బాబు, యాదవ సంఘం అధ్యక్షులు ఆవుల క్రాంతి కుమార్, ఆవుల శ్రీధర్, రుద్ర గణేష్, ఆవుల అశోక్, ఆవుల విజయ్, భజన బృందం మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం

Article Image

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో గౌరీ సహిత చంద్రశేఖర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది.

కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ప్రేమలత దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. గ్రామ ప్రధమ పౌరులుగా భక్తితో వారు చేసిన ఈ సేవ భక్తుల మనసులను ఆకట్టుకుంది.

ఉదయం గణపతి పూజ, ధ్వజారోహణం, కలశ స్థాపనలు, సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వీధివాడలుగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడంతో గ్రామమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు గంగుల వెంకట్ రెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీ రామ్ సునీత, శివకుమార్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు బోయిని ఐలమ్మ, ముత్యాల కిషన్, శానగొండ మల్లికార్జునాచారి, శానగొండ రవళి, కట్ట కుమార్ పాల్గొన్నారు.

అలాగే గ్రామ పెద్దలు వల్లే లింగారెడ్డి, వల్లే వెంకట్ రెడ్డి, బత్తుల మాధవరెడ్డి, వల్లే శేఖర్ రెడ్డి, మస్క్ బాబు, యాదవ సంఘం అధ్యక్షులు ఆవుల క్రాంతి కుమార్, ఆవుల శ్రీధర్, రుద్ర గణేష్, ఆవుల అశోక్, ఆవుల విజయ్, భజన బృందం మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News