Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:48 AM

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం

నీర్నంలలో ఘనంగా గౌరీ సహిత చంద్రశేఖర స్వామి కళ్యాణ మహోత్సవం
January 23, 2026 09:49 PM 234 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో గౌరీ సహిత చంద్రశేఖర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది.

కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ప్రేమలత దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. గ్రామ ప్రధమ పౌరులుగా భక్తితో వారు చేసిన ఈ సేవ భక్తుల మనసులను ఆకట్టుకుంది.

ఉదయం గణపతి పూజ, ధ్వజారోహణం, కలశ స్థాపనలు, సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వీధివాడలుగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడంతో గ్రామమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు గంగుల వెంకట్ రెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీ రామ్ సునీత, శివకుమార్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు బోయిని ఐలమ్మ, ముత్యాల కిషన్, శానగొండ మల్లికార్జునాచారి, శానగొండ రవళి, కట్ట కుమార్ పాల్గొన్నారు.

అలాగే గ్రామ పెద్దలు వల్లే లింగారెడ్డి, వల్లే వెంకట్ రెడ్డి, బత్తుల మాధవరెడ్డి, వల్లే శేఖర్ రెడ్డి, మస్క్ బాబు, యాదవ సంఘం అధ్యక్షులు ఆవుల క్రాంతి కుమార్, ఆవుల శ్రీధర్, రుద్ర గణేష్, ఆవుల అశోక్, ఆవుల విజయ్, భజన బృందం మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News