Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:54 AM

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న
26-01-2026 729 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్ర ప్రభుత్వ అతి ఉత్తమ అవార్డు సొంతం

రామన్నపేట స్థానికం / ప్రధాన ప్రతినిధి

పేదరికాన్ని జయించి పట్టుదలతో శిఖరాలకు చేరిన నీర్నంల గ్రామ కుమారుడు నోముల నరసయ్య మరోసారి గ్రామ ప్రతిష్టను దేశస్థాయిలో చాటాడు. ప్రస్తుతం కొండాపూర్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నరసయ్యకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అతి ఉత్తమ అవార్డు లభించింది.కమాండెంట్ ఎం. రామకృష్ణ చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోముల నరసయ్య సేవలు ప్రశంసనీయమని, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సహచరులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.

గ్రామంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక పూట పనికి వెళ్లి, రాత్రి వేళ చదువులు సాగించిన నరసయ్య జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగిన ఆయన, ఉద్యోగాన్ని సాధించిన అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు.నరసయ్యను ఆదర్శంగా తీసుకొని నీర్నంల గ్రామం నుంచి ఇరవై మందికి పైగా పోలీసు ఉద్యోగాలు సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. స్వయంగా ఆయన కుటుంబంలోనే ఐదుగురు ఉద్యోగాలు చేయడం ఆయన అంకితభావాన్ని చాటుతోంది.

ప్రస్తుతం కొండాపూర్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకోవడం గ్రామానికి గర్వకారణమని గ్రామ పెద్దలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరసన్న సాధించిన విజయం నీర్నంల గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంటున్నారు.

Sthanikam

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న

Article Image

కేంద్ర ప్రభుత్వ అతి ఉత్తమ అవార్డు సొంతం

రామన్నపేట స్థానికం / ప్రధాన ప్రతినిధి

పేదరికాన్ని జయించి పట్టుదలతో శిఖరాలకు చేరిన నీర్నంల గ్రామ కుమారుడు నోముల నరసయ్య మరోసారి గ్రామ ప్రతిష్టను దేశస్థాయిలో చాటాడు. ప్రస్తుతం కొండాపూర్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నరసయ్యకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అతి ఉత్తమ అవార్డు లభించింది.కమాండెంట్ ఎం. రామకృష్ణ చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోముల నరసయ్య సేవలు ప్రశంసనీయమని, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సహచరులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.

గ్రామంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక పూట పనికి వెళ్లి, రాత్రి వేళ చదువులు సాగించిన నరసయ్య జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగిన ఆయన, ఉద్యోగాన్ని సాధించిన అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు.నరసయ్యను ఆదర్శంగా తీసుకొని నీర్నంల గ్రామం నుంచి ఇరవై మందికి పైగా పోలీసు ఉద్యోగాలు సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. స్వయంగా ఆయన కుటుంబంలోనే ఐదుగురు ఉద్యోగాలు చేయడం ఆయన అంకితభావాన్ని చాటుతోంది.

ప్రస్తుతం కొండాపూర్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకోవడం గ్రామానికి గర్వకారణమని గ్రామ పెద్దలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరసన్న సాధించిన విజయం నీర్నంల గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంటున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News