Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:20 PM

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న

నీర్నంల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన నరసన్న
January 26, 2026 08:21 PM 701 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్ర ప్రభుత్వ అతి ఉత్తమ అవార్డు సొంతం

రామన్నపేట స్థానికం / ప్రధాన ప్రతినిధి

పేదరికాన్ని జయించి పట్టుదలతో శిఖరాలకు చేరిన నీర్నంల గ్రామ కుమారుడు నోముల నరసయ్య మరోసారి గ్రామ ప్రతిష్టను దేశస్థాయిలో చాటాడు. ప్రస్తుతం కొండాపూర్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నరసయ్యకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అతి ఉత్తమ అవార్డు లభించింది.కమాండెంట్ ఎం. రామకృష్ణ చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోముల నరసయ్య సేవలు ప్రశంసనీయమని, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సహచరులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.

గ్రామంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక పూట పనికి వెళ్లి, రాత్రి వేళ చదువులు సాగించిన నరసయ్య జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగిన ఆయన, ఉద్యోగాన్ని సాధించిన అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు.నరసయ్యను ఆదర్శంగా తీసుకొని నీర్నంల గ్రామం నుంచి ఇరవై మందికి పైగా పోలీసు ఉద్యోగాలు సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. స్వయంగా ఆయన కుటుంబంలోనే ఐదుగురు ఉద్యోగాలు చేయడం ఆయన అంకితభావాన్ని చాటుతోంది.

ప్రస్తుతం కొండాపూర్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకోవడం గ్రామానికి గర్వకారణమని గ్రామ పెద్దలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరసన్న సాధించిన విజయం నీర్నంల గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంటున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News