నీర్నెములలో ముగ్గుల పోటీల సందడి – విజేతలకు ఘన బహుమతులు
నీర్నెములలో ముగ్గుల పోటీల సందడి – విజేతలకు ఘన బహుమతులు
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కీశేగంగుల పూలమ్మ శ్రీనివాస్ రెడ్డి స్మారకార్థం నిర్వహించిన ముగ్గుల పోటీలు గ్రామాన్ని పండగ వాతావరణంలో ముంచెత్తాయి. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొనడంతో పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి.
గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కట్ట సాత్విక కుమార్కు ఐదు వేల పదహారు రూపాయలు, ద్వితీయ బహుమతి నోముల పల్లవికి మూడు వేల పదహారు రూపాయలు, తృతీయ బహుమతి సుర్వి స్వప్నకు వెయ్యి ఐదు వందల పదహారు రూపాయలు ప్రదానం చేశారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన సుర్వి ఉమా, కోయగూర రమ్య, ఆవుల నవ్యలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వయస్సుతో సంబంధం లేదన్న నిర్వాహకుల పిలుపుకు స్పందించిన చిన్నారులు కూడా పోటీల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిని గుర్తించి నలుగురు చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అంతేకాకుండా పోటీల్లో పాల్గొన్న నలభై ఏడు మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవల శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, చైర్మన్ నాగటి సునీత, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ గంగుల వెంకట్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బహుమతులను మాజీ సర్పంచ్ గంగుల వెంకట్ రెడ్డి, శ్రీలత దంపతులు అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి