Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:52 AM

నీర్నెముల: ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం

నీర్నెముల: ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం

నీర్నెముల: ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం
January 18, 2026 04:40 PM 297 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండలంలోని నీర్నెముల గ్రామ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా చిరు సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన యువతను కూడా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. ల్యాబ్ టెక్నీషియన్‌గా ఎంపికైన బండ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె బండ సౌమ్య, ఎంబీబీఎస్ పూర్తి చేసిన తిరుగుడు మమత మల్లికార్జున్ కుమార్తె తిరుగుడు సాయి హర్షిత, ముత్యాల లింగయ్య రాణి కుమార్తె ముత్యాల దివ్య, నెర్లకంటి యాదయ్య కుమార్తె నెర్లకంటి అఖిలలను సన్మానించారు.సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని, చదువు, ఉద్యోగాల ద్వారా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువత తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్న ఊరికి గౌరవం తీసుకురావాలని సూచించారు. అలాగే గ్రామాభివృద్ధికి ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అధ్యక్ష, కార్యదర్శులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగుల సోమేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నోముల యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుర్వి శ్రీనివాస్, తిరుగుడు మల్లికార్జున్, నోముల నరసింహ, గంగుల రామ్ రెడ్డి, నాగటి సోములు, నాగటి స్వామి, నోముల రాజశేఖర్, ముత్యాల మధు, ముత్యాల నవ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News