న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం – అభినందనలు తెలిపిన నాథన్ డ్యాని
న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం – అభినందనలు తెలిపిన నాథన్ డ్యాని
Krishna
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని 30 మార్చి 2026న రాష్ట్ర అసెంబ్లీలో “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026” బిల్లును ఆమోదించడం అభినందనీయమని నారాయణఖేడ్ మున్సిపల్ కోర్టు న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు నాథన్ డ్యాని తెలిపారు. ఈ చట్టం ద్వారా అన్ని వర్గాల న్యాయవాదులకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు భద్రత కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్లకు న్యాయవాదుల సంఘాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో న్యాయవాదులపై కోర్టు బయట దాడులు పెరిగినా సరైన స్పందన లేకపోయిందని, 2021లో మంథని వద్ద న్యాయవాది వామన్ రావు, నాగమణి హత్య ఘటన వంటి దారుణాలు మరువలేనివని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఈ చట్టం కీలకమై, న్యాయవాదులకు మరింత ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, భవిష్యత్తులో న్యాయవాదుల భద్రతకు బలమైన రక్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి