Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:25 AM

న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం – అభినందనలు తెలిపిన నాథన్ డ్యాని

న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం – అభినందనలు తెలిపిన నాథన్ డ్యాని

న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం – అభినందనలు తెలిపిన నాథన్ డ్యాని
03-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని 30 మార్చి 2026న రాష్ట్ర అసెంబ్లీలో “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026” బిల్లును ఆమోదించడం అభినందనీయమని నారాయణఖేడ్ మున్సిపల్ కోర్టు న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు నాథన్ డ్యాని తెలిపారు. ఈ చట్టం ద్వారా అన్ని వర్గాల న్యాయవాదులకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు భద్రత కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌లకు న్యాయవాదుల సంఘాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో న్యాయవాదులపై కోర్టు బయట దాడులు పెరిగినా సరైన స్పందన లేకపోయిందని, 2021లో మంథని వద్ద న్యాయవాది వామన్ రావు, నాగమణి హత్య ఘటన వంటి దారుణాలు మరువలేనివని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఈ చట్టం కీలకమై, న్యాయవాదులకు మరింత ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, భవిష్యత్తులో న్యాయవాదుల భద్రతకు బలమైన రక్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం – అభినందనలు తెలిపిన నాథన్ డ్యాని

Article Image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని 30 మార్చి 2026న రాష్ట్ర అసెంబ్లీలో “తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026” బిల్లును ఆమోదించడం అభినందనీయమని నారాయణఖేడ్ మున్సిపల్ కోర్టు న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు నాథన్ డ్యాని తెలిపారు. ఈ చట్టం ద్వారా అన్ని వర్గాల న్యాయవాదులకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు భద్రత కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌లకు న్యాయవాదుల సంఘాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో న్యాయవాదులపై కోర్టు బయట దాడులు పెరిగినా సరైన స్పందన లేకపోయిందని, 2021లో మంథని వద్ద న్యాయవాది వామన్ రావు, నాగమణి హత్య ఘటన వంటి దారుణాలు మరువలేనివని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఈ చట్టం కీలకమై, న్యాయవాదులకు మరింత ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, భవిష్యత్తులో న్యాయవాదుల భద్రతకు బలమైన రక్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News