Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:01 PM

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటమే అజెండా ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావును గెలిపించాలి

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటమే అజెండా ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావును గెలిపించాలి

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటమే అజెండా ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావును గెలిపించాలి
27-01-2026 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల మండలి ఎన్నికల్లో ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావుకు మద్దతుగా రామన్నపేటలో కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్రాన్ని సీనియర్ న్యాయవాది ఉయ్యాల హనుమంతు గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, జూనియర్ న్యాయవాదుల సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి శ్రీనివాసరావు అని అన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ చట్టం అమలే ఈ దాడులకు అడ్డుకట్ట అని స్పష్టం చేశారు.జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల ఉపకార వేతనం, 2019 తర్వాత నమోదు చేసుకున్న యువ న్యాయవాదులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలనే డిమాండ్లతో శ్రీనివాసరావు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అనుభవం, అంకితభావం కలిగిన వ్యక్తిని న్యాయవాదుల మండలికి పంపాలంటే సీరియల్ నెంబర్ 160కు ఓటు వేసి శ్రీనివాసరావును గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, యాదసు యాదయ్య, పాల పరమేష్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటమే అజెండా ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావును గెలిపించాలి

Article Image
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల మండలి ఎన్నికల్లో ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావుకు మద్దతుగా రామన్నపేటలో కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్రాన్ని సీనియర్ న్యాయవాది ఉయ్యాల హనుమంతు గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, జూనియర్ న్యాయవాదుల సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి శ్రీనివాసరావు అని అన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ చట్టం అమలే ఈ దాడులకు అడ్డుకట్ట అని స్పష్టం చేశారు.జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల ఉపకార వేతనం, 2019 తర్వాత నమోదు చేసుకున్న యువ న్యాయవాదులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలనే డిమాండ్లతో శ్రీనివాసరావు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అనుభవం, అంకితభావం కలిగిన వ్యక్తిని న్యాయవాదుల మండలికి పంపాలంటే సీరియల్ నెంబర్ 160కు ఓటు వేసి శ్రీనివాసరావును గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, యాదసు యాదయ్య, పాల పరమేష్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News