న్యాయవాదుల హక్కుల కోసం పోరాటమే అజెండా ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావును గెలిపించాలి
న్యాయవాదుల హక్కుల కోసం పోరాటమే అజెండా ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావును గెలిపించాలి
స్థానికం బృందం
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల మండలి ఎన్నికల్లో ఐలు అభ్యర్థి మందడపు శ్రీనివాసరావుకు మద్దతుగా రామన్నపేటలో కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్రాన్ని సీనియర్ న్యాయవాది ఉయ్యాల హనుమంతు గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, జూనియర్ న్యాయవాదుల సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి శ్రీనివాసరావు అని అన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ చట్టం అమలే ఈ దాడులకు అడ్డుకట్ట అని స్పష్టం చేశారు.జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల ఉపకార వేతనం, 2019 తర్వాత నమోదు చేసుకున్న యువ న్యాయవాదులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలనే డిమాండ్లతో శ్రీనివాసరావు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అనుభవం, అంకితభావం కలిగిన వ్యక్తిని న్యాయవాదుల మండలికి పంపాలంటే సీరియల్ నెంబర్ 160కు ఓటు వేసి శ్రీనివాసరావును గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, యాదసు యాదయ్య, పాల పరమేష్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి