నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ, ఆనందం, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.
సమాజంలో పరస్పర గౌరవం, సహనం పెంపొందేలా వేడుకలు జరగాలని, చట్టాలను గౌరవిస్తూ ప్రజా శాంతి భద్రతలకు భంగం కలగకుండా సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.
అలాగే నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలిగించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి