న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో గందరగోళం సృష్టిస్తే చర్యలు తప్పవు
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే సురక్షితంగా జరుపుకోవాలని కోహీర్ ఎస్ఐ నరేష్ సూచించారు. డిసెంబర్ 31 రాత్రి మండలవ్యాప్తంగా పోలీసు బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ చేపడతామని తెలిపారు. రాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, స్టంట్స్, డీజేలు, టపాసులు, బహిరంగ మద్యం సేవనం నిషేధమని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్లలో వేడుకలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా కోహీర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి