Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:35 PM

నార్కట్‌పల్లి పివిఆర్ చేతన పాఠశాలలో తైక్వాండో బెల్టుల ప్రదానోత్సవం

నార్కట్‌పల్లి పివిఆర్ చేతన పాఠశాలలో తైక్వాండో బెల్టుల ప్రదానోత్సవం

నార్కట్‌పల్లి పివిఆర్ చేతన పాఠశాలలో తైక్వాండో బెల్టుల ప్రదానోత్సవం
February 23, 2026 08:52 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని పివిఆర్ చేతన ఉన్నత పాఠశాలలో నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆదివారం బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల హాజరయ్యారు. తైక్వాండో పరీక్షలకు ఎగ్జామినర్‌గా పట్టేడి సుధాకర్ వ్యవహరించి విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. ప్రతిభ ఆధారంగా మొత్తం 65 మంది విద్యార్థులకు వివిధ స్థాయిల బెల్టులు అందజేశారు.

బెల్టుల వివరాలు ఇలా ఉన్నాయి: రెడ్ వన్ – 2, రెడ్ – 2, బ్లూ వన్ – 4, బ్లూ – 5, గ్రీన్ వన్ – 8, గ్రీన్ – 5, ఎల్లో వన్ – 11, ఎల్లో – 28.

ఈ బెల్టులు సాధించిన విద్యార్థుల్లో నార్కట్‌పల్లి మండలానికి చెందిన 28 మంది, చిట్యాల మండలానికి చెందిన 28 మంది, రామన్నపేట మండలానికి చెందిన 9 మంది ఉన్నారు.ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ తైక్వాండో క్రీడ ప్రభుత్వ ఉద్యోగాల సాధనలోఎంతోఉపయోగపడుతుందని, ప్రభుత్వ కోటాలో రెండు శాతం ఉద్యోగాల్లో ఈ క్రీడాకారులకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదనంగా ఈ క్రీడ ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పుచ్చకాయల వెంకట్ రెడ్డి, జవహర్ లాల్, తైక్వాండో శిక్షకులు గోలి రమేష్, పంతంగి శ్రీకాంత్, పట్టేడ ఫణీంద్ర కుమార్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News