నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం
నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం
Editor Desk
ఆదోని:
జనవరి 23న నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలోని నిర్మల్ టాకీస్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా–నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.అదే రోజున ఆదోని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలతో పాటు సుమారు 3,000 మంది విద్యార్థులకు అవసరమైన విద్యా కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, యువ నాయకులు మారుతి నాయుడు ఆధ్వర్యంలో అన్ని వర్గాల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా యువ నాయకులు భూపాల్ చౌదరి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలేని సూర్యనారాయణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, లక్ష్మీనారాయణ, జయరాం, వీరేష్, ఎరుకల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి