Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:44 AM

నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం

నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం

నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం
January 19, 2026 06:36 PM 200 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని:

జనవరి 23న నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలోని నిర్మల్ టాకీస్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా–నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.అదే రోజున ఆదోని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలతో పాటు సుమారు 3,000 మంది విద్యార్థులకు అవసరమైన విద్యా కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, యువ నాయకులు మారుతి నాయుడు ఆధ్వర్యంలో అన్ని వర్గాల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా యువ నాయకులు భూపాల్ చౌదరి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలేని సూర్యనారాయణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, లక్ష్మీనారాయణ, జయరాం, వీరేష్, ఎరుకల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News