Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 PM

నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం

నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం

నారా లోకేష్ జన్మదినానికి మెగా రక్తదాన శిబిరం
January 19, 2026 06:36 PM 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని:

జనవరి 23న నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలోని నిర్మల్ టాకీస్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా–నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.అదే రోజున ఆదోని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలతో పాటు సుమారు 3,000 మంది విద్యార్థులకు అవసరమైన విద్యా కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, యువ నాయకులు మారుతి నాయుడు ఆధ్వర్యంలో అన్ని వర్గాల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా యువ నాయకులు భూపాల్ చౌదరి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలేని సూర్యనారాయణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, లక్ష్మీనారాయణ, జయరాం, వీరేష్, ఎరుకల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News