నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన గాజుల సుకన్య
నకిరేకల్ స్థానికం ప్రతినిధి:
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్లో నాలుగో వార్డు సంతోష్నగర్కు చెందిన సుల్తాన్ ధనమ్మ–వెంకటయ్య కుమారుడి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు దాంపత్య జీవితంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజలతో కలసి స్నేహపూర్వకంగా మాట్లాడిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి