Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:45 PM

నాలుగో వార్డులో ‘Arrive Alive’ అవగాహన — మైనర్లకు టూవీలర్లు నో!

నాలుగో వార్డులో ‘Arrive Alive’ అవగాహన — మైనర్లకు టూవీలర్లు నో!

నాలుగో వార్డులో ‘Arrive Alive’ అవగాహన — మైనర్లకు టూవీలర్లు నో!
13-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

“మైనర్లకు టూవీలర్ వాహనాలు ఇవ్వరాదు… ప్రతి వాహనదారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని ఎస్సై రూపా శ్రీ స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నాలుగో వార్డులో సోమవారం నిర్వహించిన ‘99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘Arrive Alive’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నాలుగో వార్డ్ కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై రూపా శ్రీ మాట్లాడుతూ — నిర్లక్ష్యం, అధిక వేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. చాలా మంది ఈ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టూవీలర్ వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాగేందర్, ములుగు నరసింహ, విజయ్‌తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

నాలుగో వార్డులో ‘Arrive Alive’ అవగాహన — మైనర్లకు టూవీలర్లు నో!

Article Image

యాదగిరిగుట్ట,

“మైనర్లకు టూవీలర్ వాహనాలు ఇవ్వరాదు… ప్రతి వాహనదారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని ఎస్సై రూపా శ్రీ స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నాలుగో వార్డులో సోమవారం నిర్వహించిన ‘99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘Arrive Alive’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నాలుగో వార్డ్ కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై రూపా శ్రీ మాట్లాడుతూ — నిర్లక్ష్యం, అధిక వేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. చాలా మంది ఈ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టూవీలర్ వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాగేందర్, ములుగు నరసింహ, విజయ్‌తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News