నాలుగో వార్డులో ‘Arrive Alive’ అవగాహన — మైనర్లకు టూవీలర్లు నో!
నాలుగో వార్డులో ‘Arrive Alive’ అవగాహన — మైనర్లకు టూవీలర్లు నో!
Editor Desk
యాదగిరిగుట్ట,
“మైనర్లకు టూవీలర్ వాహనాలు ఇవ్వరాదు… ప్రతి వాహనదారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని ఎస్సై రూపా శ్రీ స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నాలుగో వార్డులో సోమవారం నిర్వహించిన ‘99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘Arrive Alive’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నాలుగో వార్డ్ కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై రూపా శ్రీ మాట్లాడుతూ — నిర్లక్ష్యం, అధిక వేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. చాలా మంది ఈ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టూవీలర్ వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాగేందర్, ములుగు నరసింహ, విజయ్తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి