నల్గొండ జిల్లా దీక్ష శిబిరంలో ఎస్కే చాంద్
నల్గొండ జిల్లా దీక్ష శిబిరంలో ఎస్కే చాంద్
Editor Desk
ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
తెలంగాణ ఉద్యమకారులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చాంద్ డిమాండ్ చేశారు. అలాగే ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలంతో పాటు నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఎస్కే చాంద్ పాల్గొని ఉద్యమకారుల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం మరచిపోకూడదన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయడమే నిజమైన తెలంగాణ ఆత్మగౌరవమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, మండల నాయకులు గడ్డం యాదగిరి, అశోక్, ఎండి. ఇమామ్తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి