Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:27 AM

నల్గొండలో ఉద్యోగాల పేరిట భారీ మోసం – పోలీసుల దాడులకు సిద్ధం

నల్గొండలో ఉద్యోగాల పేరిట భారీ మోసం – పోలీసుల దాడులకు సిద్ధం

నల్గొండలో ఉద్యోగాల పేరిట భారీ మోసం – పోలీసుల దాడులకు సిద్ధం
03-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి రావడంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మోసగాళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక్కొక్కరి నుంచి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసిన గ్యాంగ్ కార్యకలాపాలు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మండలాల వారీగా ఏజెంట్లను నియమించి చైన్ సిస్టమ్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ముఠా చేతిలో వందలాది మంది నిరుద్యోగులు మోసపోయినట్లు సమాచారం. బాధితులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు. నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్ల వద్ద బాధితుల రద్దీ పెరుగుతోంది.

బాధితుల ఫిర్యాదుల మేరకు పలువురు నిందితులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారులు గోవాకు పరారైనట్లు సమాచారం అందుతోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి.

జిల్లాలో కలకలం రేపుతున్న ఈ ఉద్యోగాల మోసం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నిరుద్యోగులు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Sthanikam

నల్గొండలో ఉద్యోగాల పేరిట భారీ మోసం – పోలీసుల దాడులకు సిద్ధం

Article Image

నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి రావడంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మోసగాళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, ఒక్కొక్కరి నుంచి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసిన గ్యాంగ్ కార్యకలాపాలు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మండలాల వారీగా ఏజెంట్లను నియమించి చైన్ సిస్టమ్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ముఠా చేతిలో వందలాది మంది నిరుద్యోగులు మోసపోయినట్లు సమాచారం. బాధితులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు. నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్ల వద్ద బాధితుల రద్దీ పెరుగుతోంది.

బాధితుల ఫిర్యాదుల మేరకు పలువురు నిందితులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారులు గోవాకు పరారైనట్లు సమాచారం అందుతోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి.

జిల్లాలో కలకలం రేపుతున్న ఈ ఉద్యోగాల మోసం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నిరుద్యోగులు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News