Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 17, 2026 09:21 PM

నల్గొండ ఎక్స్‌రోడ్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు మృతి

నల్గొండ ఎక్స్‌రోడ్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు మృతి

నల్గొండ ఎక్స్‌రోడ్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు మృతి
March 10, 2026 06:40 AM 325 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

నల్గొండ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ ఎక్స్‌రోడ్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి చెందారు. ఓవర్‌టేకింగ్ సమయంలో బస్సు, లారీ స్వల్పంగా ఢీకొనడంతో డ్రైవర్లు వాహనాలను ఆపి మాట్లాడుతుండగా, అతివేగంగా వచ్చిన మరో లారీ నిలిపి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనాల మధ్యలో ఉన్న మోజో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు క్లీనర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News