నల్గొండ దివ్యాంగులకు శుభవార్త ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం
నల్గొండ దివ్యాంగులకు శుభవార్త ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్గొండ దివ్యాంగులకు
ఈనెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తులు
నల్గొండ జిల్లా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను 100 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 30వ తేదీ లోగా tso.bmms.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
ప్రభుత్వ సహకారంతో అమలులో ఉన్న ఈ పథకం ద్వారా దివ్యాంగుల ఆత్మనిర్భరతకు తోడ్పాటు అందించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు బిజినెస్ బ్యాటరీ సైకిళ్లు, ట్యాబ్స్, మూడు చక్రాల రిక్షాలు, వీల్ చైర్లు, చంక కర్రలు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్ తదితర అవసరమైన ఉపకరణాలను సహకార సంస్థ ద్వారా ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు.
అర్హత ప్రమాణాలు పూర్తిచేసిన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే సంబంధిత మండల కార్యాలయాలను సంప్రదించాలని జిల్లా సంక్షేమ అధికారి సూచించారు.
ఈ పథకం ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడి, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి