నకిరేకల్లో రైతులకు యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ
నకిరేకల్లో రైతులకు యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పాల్గొని లబ్ధిదారులైన రైతులకు సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో సాగు వ్యయం తగ్గి, దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం సబ్సిడీలను అమలు చేస్తున్నదన్నారు.
గత ప్రభుత్వ పాలనలో రైతులకు సబ్సిడీలు లేకుండా రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచారని విమర్శించారు. ఇంటింటికి నల్లా వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందని తెలిపారు.
నకిరేకల్ నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర నివాస పాఠశాల నిర్మాణం చేపట్టామని, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి