Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:55 AM

నకిరేకల్‌లో రైతులకు యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ

నకిరేకల్‌లో రైతులకు యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ

నకిరేకల్‌లో రైతులకు యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ
26-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పాల్గొని లబ్ధిదారులైన రైతులకు సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో సాగు వ్యయం తగ్గి, దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం సబ్సిడీలను అమలు చేస్తున్నదన్నారు.

గత ప్రభుత్వ పాలనలో రైతులకు సబ్సిడీలు లేకుండా రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచారని విమర్శించారు. ఇంటింటికి నల్లా వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర నివాస పాఠశాల నిర్మాణం చేపట్టామని, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నకిరేకల్‌లో రైతులకు యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పాల్గొని లబ్ధిదారులైన రైతులకు సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో సాగు వ్యయం తగ్గి, దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతులకు అండగా నిలిచేలా ప్రభుత్వం సబ్సిడీలను అమలు చేస్తున్నదన్నారు.

గత ప్రభుత్వ పాలనలో రైతులకు సబ్సిడీలు లేకుండా రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచారని విమర్శించారు. ఇంటింటికి నల్లా వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర నివాస పాఠశాల నిర్మాణం చేపట్టామని, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News